ప్రశ్న
యేసు మన విమోచన మూల్యాన్ని ఎలా చెల్లించాడు? అది ఎవరికి చెల్లించబడింది?
జవాబు
విమోచనకరమైనది అంటే బందీగా పట్టుకోబడిన వారి విడుదల కోసం చెల్లించేది. యేసు మన పాపము, మరణము, మరియు నరకము నుండి మనలను విడిపించడానికి మన విమోచనకరమైన దానిని చెల్లించారు. నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, మరియు ద్వితీయోపదేశకాండము గ్రంథాలలో బలి అర్పణల కొరకు దేవుని ఆవశ్యకతలు కనుగొనబడతాయి. పాత నిబంధన కాలంలో, ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం కోసం జంతువుల బలి అర్పించమని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు; అనగా, పాపనికి శిక్ష మరణం కాబట్టి (రోమీయులకు 6:23), ఒక వ్యక్తి మరణం స్థానంలో ఒక జంతువు మరణం తీసుకుంది. నిర్గమకాండము 29:36 ఇలా చెబుతోంది, "ప్రతిరోజూ పాపముల ప్రాయశ్చిత్తము కొరకు ఒక యవ్వన దూడను బలిగా అర్పించవలెను."
దేవుడు పరిశుద్ధతను ఆజ్ఞాపిస్తున్నాడు (1 పేతురు 1:15-16). దేవుని ధర్మశాస్త్రం పరిశుద్ధతను ఆజ్ఞాపిస్తుంది. మనం చేసే పాపాల కారణంగా మనం దేవునికి పూర్తి పరిశుద్ధతను ఇవ్వలేము (రోమీయులకు 3:23); అందువల్ల, దేవుడు తన ధర్మశాస్త్ర సంతృప్తిని కోరుతున్నాడు. ఆయనకు అర్పించే బలులు ఆ అవసరాలను తీర్చాయి. ఇక్కడే యేసు పాత్ర వస్తుంది. హెబ్రీయులకు 9:12-15 మనకు ఇలా చెబుతోంది: "ఆయన శాశ్వతమైన ఆత్మ శక్తి ద్వారా మన పాపాల కొరకు తనను తానే దేవునికి పరిపూర్ణమైన బలిగా అర్పించుకున్నారు. అందుకే ఆయన దేవునికి, ప్రజలకు మధ్య నూతన నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నారు, తద్వారా ఆహ్వానించబడిన వారందరూ శాశ్వతమైన జీవాన్ని పొందగలరు. పాత నిబంధన క్రింద, మేకల, దూడల రక్తములు మరియు దూడ యొక్క బూడిద ప్రజల శరీరాలను ఆచారపరమైన అపవిత్రత నుండి శుభ్రపరచగలిగేవి. మనం జీవముగల దేవునికి ఆరాధించేలా, మరణానికి దారితీసే క్రియల నుండి క్రీస్తు రక్తం మన హృదయాలను ఎంతగా శుద్ధి చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకనగా నిత్య ఆత్మ శక్తివల్ల, క్రీస్తు మన పాపముల కొరకు తనను తానే దేవునికి పరిపూర్ణమైన బలిగా అర్పించుకున్నాడు. అందుకే దేవునికి మరియు ప్రజలకు మధ్య నూతన నిబంధనకు మధ్యవర్తిగా ఆయననే ఉన్నాడు, తద్వారా ఆహ్వానించబడిన వారందరూ దేవుడు వారికి వాగ్దానం చేసిన నిత్యమైన వారసత్వాన్ని పొందగలరు. ఎందుకనగా ఆ మొదటి నిబంధన క్రింద వారు చేసిన పాపముల దండన నుండి వారిని విడిపించడానికి క్రీస్తు మరణించాడు.
అలాగే, రోమీయులు 8:3-4 చదవండి, "మన పాపపు స్వభావం వలన మోషే ధర్మశాస్త్రం మనలను రక్షించలేకపోయింది. కానీ దేవుడు మనలను రక్షించడానికి ఒక విభిన్నమైన ప్రణాళికను అమలులోకి తెచ్చాడు. ఆయన తన సొంత కుమారుడిని మనలాంటి మానవ శరీరంలో పంపాడు, కానీ మన శరీరాలు పాపపూరితమైనవి. మన పాపాల కొరకు తన కుమారుని బలిగా అర్పించి, దేవుడు మన మీద పాపపు ఆధిపత్యాన్ని నాశనం చేశాడు. ఇలా ఆయన ఎందుకు చేశాడంటే, ఇకపై తమ పాప స్వభావాన్ని అనుసరించకుండా, ఆత్మను అనుసరించే మన కోసం ధర్మశాస్త్రపు ఆవశ్యకత పూర్తిగా నెరవేరాలి."
స్పష్టంగా, యేసు మన జీవితాల విమోచనకరమైన మూల్యాన్ని దేవునికి చెల్లించారు. ఆ మూల్యం ఆయన సొంత జీవితం, ఆయన సొంత రక్తాన్ని చిందించడం, ఒక బలి అర్పణ. ఆయన యొక్క బలి మరణం వలన, భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి ఆ ప్రాయశ్చిత్త బహుమతిని అంగీకరించి, దేవునిచే క్షమించబడే అవకాశం ఉంది. ఎందుకంటే, ఆయన మరణం లేకుండా, దేవుని ధర్మశాస్త్రం మన సొంత మరణం ద్వారా ఇంకా సంతృప్తి పరచబడవలసి వచ్చేది.
English
యేసు మన విమోచన మూల్యాన్ని ఎలా చెల్లించాడు? అది ఎవరికి చెల్లించబడింది?