ప్రశ్న
యేసు మన పాపాల కొరకు చనిపోయాడనగా అర్థం ఏమిటి?
జవాబు
సులభంగా చెప్పాలంటే, మన పాపాల కొరకు యేసు సిలువ మీద మరణించకపోతే, ఎవరూ నిత్యజీవం పొందేవారు కాదు. యేసు స్వయంగా ఇలా అన్నారు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారా తప్ప తండ్రియొద్దకు వచ్చువాడు ఎవడును లేడు" (యోహాను 14:6). ఈ వాక్యంలో, యేసు తన జననం, మరణం, మరియు పునరుత్థానం యొక్క కారణాన్ని ప్రకటించారు—అదేమిటంటే, పాపపు మానవులకు స్వర్గ మార్గాన్ని అందించడం, వారు తమంతట తాముగా అక్కడికి ఎప్పటికీ చేరుకోలేరు.
దేవుడు ఆదామును, హవ్వను సృష్టించినప్పుడు, వారు ప్రతి విధంగా పరిపూర్ణులుగా ఉండి, ఏదెను తోట అనే ఒక స్వర్గతుల్యమైన ప్రదేశంలో నివసించారు (ఆదికాండము 2:15). దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు, అంటే వారికి కూడా తమ స్వచ్ఛంద సంకల్పంతో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండేది. ఆదాము మరియు హవ్వలు సాతాను ప్రలోభాలకు మరియు అబద్ధాలకు ఎలా లొంగిపోయారో ఆదికాండము 3 వ అధ్యాయములో వివరించబడింది. అలా చేయడం ద్వారా, వారు తినవద్దని ఆజ్ఞాపించబడిన జ్ఞానవృక్షపు ఫలమును తిని దేవుని చిత్తానికి అవిధేయత చూపారు: "మరియు దేవుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెనుఅ" (ఆదికాండము 2:16-17). ఇది మనుష్యుడు చేసిన మొదటి పాపము, మరియు దాని ఫలితముగా, ఆదాము నుండి వారసత్వముగా వచ్చిన మన పాప స్వభావము వలన సమస్త మానవజాతి శారీరక మరియు నిత్య మరణములకు లోనగుచున్నారు.
పాపము చేయువారందరు శారీరకముగాను ఆత్మీయముగాను మరణించెదరని దేవుడు ప్రకటించెను. ఇది సమస్త మానవాళి యొక్క విధి. కానీ దేవుడు తన కృప మరియు కరుణలో, ఈ గందరగోళం నుండి బయటపడటానికి ఒక మార్గాన్ని అందించాడు, అదే సిలువ మీద తన పరిపూర్ణ కుమారుని రక్తమును చిందించడం. "రక్తము చిందకపోతే క్షమాపణ లేదు" (హెబ్రీయులు 9:22) అని దేవుడు ప్రకటించెను, కానీ రక్తము చిందడం ద్వారా విమోచన కలుగుతుంది. మోషే ధర్మశాస్త్రం ప్రజలు దేవుని దృష్టిలో "పాపరహితులు"గా లేదా "నీతిమంతులు"గా పరిగణించబడటానికి ఒక మార్గాన్ని అందించింది—వారు చేసిన ప్రతి పాపానికి జంతువులను బలిగా అర్పించడం. అయితే, ఈ బలులు కేవలం తాత్కాలికమైనవి, మరియు అవి నిజానికి సిలువపై క్రీస్తు యొక్క పరిపూర్ణమైన, ఒక్కసారే జరిగిన బలికి ఒక ముందస్తు సూచన మాత్రమే (హెబ్రీయులు 10:10).
అందుకే యేసు వచ్చారు మరియు ఆయన మరణించారు, మన పాపాల కొరకు అంతిమ మరియు చివరి బలిగా, పరిపూర్ణమైన (దిట్టరహితమైన) బలిగా మారడానికి (కొలొస్సయులు 1:22; 1 పేతురు 1:19). ఆయన ద్వారా, యేసును విశ్వసించే వారికి దేవునితో నిత్యజీవ వాగ్దానం విశ్వాసం ద్వారా సమర్థవంతంగా అవుతుంది. "యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా వాగ్దానమునకు అర్హులగునట్లు" (గలతీయులకు 3:22). విశ్వాసము మరియు నమ్మకము అనే ఈ రెండు పదములు మన రక్షణకు అత్యంత కీలకమైనవి. మన పాపముల కొరకు క్రీస్తు చిందించిన రక్తమును నమ్మడము ద్వారానే మనము నిత్యజీవమును పొందుదుము. "మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు" (ఎఫెసయులు 2:8–9).
English
యేసు మన పాపాల కొరకు చనిపోయాడనగా అర్థం ఏమిటి?