ప్రశ్న
యెషయా 53లో ఉన్న "బాధపడే దాసుడు" ప్రవచనం యేసు గురించా?
జవాబు
యూదుల మెస్సయ్య రాక గురించి తానాఖ్లో (హీబ్రూ గ్రంథాలు / పాత నిబంధన) ఉన్న అతి గొప్ప మెస్సయ్య ఊహలలో ఒకటి, ప్రవక్త యెషయా యొక్క 53వ అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రవక్తల గ్రంథంలోని ఈ భాగం, "బాధపడే సేవకుడు" అని కూడా పిలువబడుతుంది. ఇది ఒక రోజు సీయోనుకు రాబోయే విమోచకుడి గురించి మాట్లాడుతుందని యూదు మతంలోని చారిత్రక రబ్బీలు చాలా కాలంగా అర్థం చేసుకున్నారు. యెషయా 53లోని "బాధపడే దాసుడు" యొక్క గుర్తింపు గురించి యూదు మతం సాంప్రదాయకంగా ఏమి నమ్మిందో ఇక్కడ కొన్ని ఉదాహరణలు:
బాబిలోనియన్ తల్ముద్ ఇలా చెబుతోంది: "మెస్సయ్య, అతని పేరు ఏమిటి? రబ్బీలు ఇలా అంటారు, కుష్టు వ్యాధి గ్రస్తుడైన పండితుడు, ఎందుకంటే ఇలా చెప్పబడింది, 'నిశ్చయంగా ఆయన మన దుఃఖాలను మోశాడు మరియు మన శోకాలను వహించాడు: అయినప్పటికీ, ఆయనను ఒక కుష్టు వ్యాధి గ్రస్తుడుగా, దేవునిచే తాకినవాడిగా మరియు బాధపడినవాడిగా మేము ఎంచుకున్నాము...'" (సన్హెడ్రిన్ 98b).
మిద్రాష్ రూత్ రబ్బా ఇలా చెబుతోంది: "మరొక వివరణ (రూతు 2:14): ఆయన రాజు అయిన మెస్సయ్య గురించి మాట్లాడుతున్నారు; 'ఇటు రమ్ము,' సింహాసనానికి సమీపించుము; 'మరియు రొట్టెను తినుము,' అనగా రాజ్యపు రొట్టె; 'మరియు నీ ముక్కను వెనిగరులో ముంచుము,' ఇది ఆయన శిక్షలను సూచిస్తుంది, ఎందుకంటే ఇలా చెప్పబడింది, 'కానీ ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపడెను, మన దుష్టుతనముల నిమిత్తము నలిపివేయబడెను.'"
తార్గమ్ జోనాథన్ ఇలా చెబుతోంది: "చూడుడి, నా సేవకుడైన మెస్సయ్య వృద్ధిపొందును; అతడు ఉన్నతస్థితికి ఎదిగి, వృద్ధి చెంది, అత్యంత బలవంతుడుగా ఉండును."
జోహార్ ఇలా చెబుతోంది: ""ఆయన మన అతిక్రమముల కొరకు గాయపరచబడెను,' మొదలైనవి.... ఏదెను తోటలో 'రోగపుత్రుల రాజభవనం' అనే ఒక రాజభవనం ఉంది; ఆ రాజభవనంలోకి అప్పుడు మెస్సయ్య ప్రవేశించి, ఇశ్రాయేలు యొక్క ప్రతి వ్యాధిని, ప్రతి వేదనను, మరియు ప్రతి శిక్షను పిలుస్తాడు; అవన్నీ వచ్చి ఆయన మీద పడతాయి. అతడు ఇశ్రాయేలు మీది నుండి వాటి భారాన్ని తగ్గించి, వాటిని తన మీదకు తీసుకోకపోయి ఉంటే, ధర్మవిధి ఉల్లంఘన కొరకు ఇశ్రాయేలు యొక్క శిక్షలను భరించగల మనిషి ఎవరూ ఉండేవాడు కాదు: మరియు ఇది వ్రాయబడినది, 'నిశ్చయముగా మన రోగములను ఆయన మోసియున్నాడు.'"
గొప్ప (రంబామ్) రబ్బీ మోషే మైమోనిడెస్ ఇలా అంటారు: "మెస్సయ్య రాక విధానం ఏమిటి....అంతకు ముందు ఎవరికీ తెలియని ఒకరు ఉద్భవిస్తారు, మరియు ఆయన చేత జరిగించబడే సూచనలు మరియు అద్భుతాలు ఆయన నిజమైన మూలానికి రుజువులుగా ఉంటాయి; ఎందుకంటే సర్వశక్తిమంతుడు, ఈ విషయంపై తన అభిప్రాయాన్ని మనకు వెల్లడించిన చోట, ఇలా అంటున్నాడు, 'ఇదిగో, అతని నామం చిగురు, మరియు అతడు తన స్థానం నుండి చిగురిస్తాడు' (జెకర్యా 6:12). మరియు యెషయా ఆయన ప్రత్యక్షమయ్యే కాలమునుగూర్చి, ఆయనకు తండ్రి గానీ, తల్లి గానీ, కుటుంబము గానీ తెలియకుండా, ఆయన ఆయన యెదుట ఒక మొలకవలె, ఎండిన భూమిలోనుండి పుట్టిన మొదలువలె ఎదిగారని ఇలాగే చెప్తున్నాడు, మొదలైనవి.... రాజులు ఆయన మాట వినే విధానాన్ని వివరిస్తూ యెషయా మాటలలో, "రాజులు ఆయనను చూచి నోరు మూసికొందురు; ఎందుకంటే వారికి తెలియజేయనిదానిని వారు చూచిరి, మరియు వారు విననిదానిని గ్రహించిరి."
దురదృష్టవశాత్తు, ఆధునిక యూదు మత గురువులు యెషయా 53లోని "బాధపడే దాసుడు" బహుశా ఇజ్రాయెల్ను, లేదా యెషయాను, లేదా మోషేను లేదా మరొక యూదు ప్రవక్తను సూచిస్తుందని నమ్ముతారు. కానీ యెషయా స్పష్టంగా చెప్పాడు - అతను చాలా మంది ప్రాచీన మత గురువులు నిర్ధారించినట్లుగా, మెస్సయ్య గురించే మాట్లాడాడు.
యెషయా 53లోని రెండవ వచనం ఈ స్పష్టతను ధృవీకరిస్తుంది. ఆ వ్యక్తి "ఒక చిగురు మొక్కలా, మరియు పొడి నేల నుండి మొలిచిన వేరులా" పెరుగుతాడు. పైకి మొలిచే ఈ చిగురు నిస్సందేహంగా మెస్సయ్యను సూచిస్తుంది, మరియు వాస్తవానికి, ఇది యెషయాలో మరియు ఇతర చోట్ల ఒక సాధారణ మెస్సయ్య సూచన. దావీదు వంశం తీర్పులో నరికివేసిన చెట్టులా నరికివేయబడాలి, కానీ ఆ కాండం నుండి ఒక కొత్త మొలక మొలుస్తుందని ఇశ్రాయేలుకు వాగ్దానం చేయబడింది. ఆ మొలకనే రాజు అయిన మెస్సయ్య.
నిస్సందేహంగా, యెషయా 53లోని "బాధపడే దాసుడు" మెస్సయ్యను సూచిస్తుంది. అతని ముందు రాజులు నోరు మూసుకునేంతగా అతను అత్యంత ఉన్నతీకరించబడ్డాడు. మెస్సయ్య పడిపోయిన దావీదు వంశం నుండి మొలకెత్తిన మొలక. అతను రాజులకధిపతి అయినాడు. అతను అంతిమ ప్రాయిష్ఠలికం అందించాడు.
యెషయా 53, రాబోయే దావీదు వంశపు రాజు, అనగా మెస్సయ్యను సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి మెస్సయ్య రాజు బాధపడి, చనిపోయి, తిరిగి లేవతాడని ప్రవచించబడింది. ఆయన ప్రపంచ దేశాలకు యాజకునిగా సేవచేసి, నమ్మువారిని శుద్ధి చేయడానికి ప్రాయశ్చిత్త రక్తాన్ని పూస్తాడు. దీనికి సూచితుడవ్వగల ఏకైక వ్యక్తి యేసు క్రీస్తు మాత్రమే!
ఆయనను ఒప్పుకొనే వారు ఆయన కుమారులు, ఆయన వాగ్దాన సంతానం, మరియు ఆయన విజయం యొక్క లాభాలు. యూదు అపోస్తలుల సాక్ష్యం ప్రకారం, యేసు మన పాపముల కొరకు చనిపోయి, తిరిగి లేచి, దేవుని కుడి పార్శ్వమున ఆరోహణుడై, ఇప్పుడు మన పాపములను శుద్ధి చేసే మన గొప్ప ప్రధాన యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు (హెబ్రీయులు 2:17; 8:1). యేసు, యూదుల మెస్సయ్య, యెషయా ముందుగా చూసిన వాడే.
రబ్బీ మోషే కోహెన్ ఇబ్న్ క్రిస్పిన్ ఇలా అన్నారు, "ఇశయా 53ను ఇశ్రాయేలుకు సంబంధించినదిగా వ్యాఖ్యానించే వారిని, 'మన బోధకుల జ్ఞానాన్ని విడిచిపెట్టి, తమ సొంత హృదయాల మొండితనం, మరియు తమ సొంత అభిప్రాయం ప్రకారం వంగిపోయిన వారిగా' ఈ రబ్బీ వర్ణించారు, మరియు మన రబ్బీల బోధనకు అనుగుణంగా, రాజు అయిన మెస్సయ్య గురించి దీనిని వ్యాఖ్యానించడానికి నేను సంతోషిస్తున్నాను. భవిష్యత్తులో రాబోయే మెస్సయ్య యొక్క స్వభావం గురించి, మరియు అతను ఇశ్రాయేలును విడిపించడానికి వచ్చే సమయం నుండి, ఒక విమోచకుడిగా తన ఆగమనం వరకు ఉన్న తన జీవితం గురించి మనకు తెలియజేయాలనే దైవిక ఆజ్ఞ మేరకు యెషయా ఈ ప్రవచనాన్ని ఇచ్చారు. తద్వారా, ఎవరైనా తానే మెస్సయ్యనని చెప్పుకుంటే, ఇక్కడ వర్ణించబడిన లక్షణాలకు అతనిలో ఏమైనా సారూప్యత ఉందేమో మనం పరిశీలించి, ఆలోచించవచ్చు; ఒకవేళ అటువంటి పోలిక ఏదైనా ఉంటే, ఆయన మన నీతికైన మెస్సయ్య అని మనం నమ్మవచ్చు; కానీ అలా లేకపోతే, మనం నమ్మలేము.
English
యెషయా 53లో ఉన్న "బాధపడే దాసుడు" ప్రవచనం యేసు గురించా?