settings icon
share icon
ప్రశ్న

క్రీస్తు శిలువ మీద పలికిన చివరి ఏడు మాటలు ఏమిటి మరియు వాటి అర్థాలు ఏమిటి?

జవాబు


యేసు క్రీస్తు శిలువ మీద పలికిన ఏడు వాక్యాలు (ఏ నిర్దిష్ట క్రమంలోనూ కాదు):

(1) మత్తయి 27:46 మనకు చెబుతున్నది ఏమనగా, సుమారు తొమ్మిదవ గంట సమయంలో యేసు గొప్ప స్వరముతో, "ఏలీ, ఏలీ, లామా సబక్తనీ?" అని అరిచాడు, దాని అర్థం, "నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?" ఇక్కడ, దేవుడు లోక పాపములను ఆయన మీద మోపినప్పుడు యేసు తన పరిత్యాగ భావనను వ్యక్తపరుస్తున్నాడు. యేసు ఆ పాపభారాన్ని భరిస్తున్నప్పుడు, ఏకైక పరిశుద్ధుడైన ఆయన, "మనకొరకు పాపముగా చేయబడ్డాడు" (2 కొరింథీయులకు 5:21), మరియు ఆయన బాధతో కేకవేశాడు. సిలువ నుండి వచ్చిన ఈ కేక కీర్తన 22:1లోని వాక్యాన్ని ప్రతిధ్వనించింది.

(2) "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" (లూకా 23:34). యేసును శిలువ వేసినవారికి వారు ఏమి చేస్తున్నారో దాని పూర్తి పరిధి తెలియదు, ఎందుకంటే వారు ఆయనను మెస్సయ్యగా గుర్తించలేదు. దైవిక సత్యం గురించిన వారి అజ్ఞానం వారు క్షమాపణకు అర్హులు అని అర్థం కానప్పటికీ, ఆయనను ఎగతాళి చేస్తున్నప్పుడు క్రీస్తు చేసిన ప్రార్థన దైవిక కృప యొక్క అపరిమితమైన కరుణకు ఒక వ్యక్తీకరణ.

(3) "నిజమైన మాటగా నీతో చెప్తున్నాను, ఈ రోజే నీవు నాతో పరదైసులో ఉంటావు" (లూకా 23:43). ఈ వాక్యంలో, సిలువ వేయబడిన దుష్టులలో ఒకరితో యేసు, తాను మరణించినప్పుడు పరలోకంలో తనతో ఉంటానని భరోసా ఇస్తున్నారు. అతని మరణ సమయంలో కూడా, ఆ దుష్టుడు యేసు ఎవరో అని గుర్తించి, ఆయనపై తన విశ్వాసాన్ని వ్యక్తపరచినందువల్ల ఈ వాగ్దానం అతనికి లభించింది (లూకా 23:42).

(4) "తండ్రీ, నీ చేతులలో నేను నా ఆత్మను అప్పగిస్తున్నాను" (లూకా 23:46). ఇక్కడ, యేసు తన ఆత్మను స్వచ్ఛందంగా తండ్రి చేతులలో అప్పగిస్తున్నారు, ఇది ఆయన మరణించబోతున్నారని మరియు దేవుడు ఆయన బలిని అంగీకరించాడని సూచిస్తుంది. ఆయన "తనను తాను దోషములేనివానిగా దేవునికి అర్పించుకున్నారు" (హెబ్రీయులు 9:14).

(5) "అమ్మా, ఇదిగో నీ కుమారుడు!" మరియు "ఇదిగో నీ తల్లి!" యేసు తన తల్లిని, తాను ప్రేమించిన అపొస్తలుడైన యోహానుతో కూడ శిలువ దగ్గర నిలబడి ఉండగా చూచి, తన తల్లి బాగోగులను యోహానుకు అప్పగించెను. అప్పటినుండి యోహాను ఆమెను తన ఇంటికి తీసికొనిపోయెను (యోహాను 19:26-27). ఈ వాక్యంలో, ఎల్లప్పుడూ కరుణామయుడైన కుమారునిగా, యేసు తన మరణం తర్వాత తన భౌతిక తల్లికి సంరక్షణ కలుగుతుందని నిర్ధారించుకుంటున్నారు.

(6) "నాకు దప్పికగా ఉన్నది" (యోహాను 19:28). యేసు ఇక్కడ కీర్తనల గ్రంథము 69:21 నుండి వచ్చిన మెస్సయ్య ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు: "వారు నా ఆహారములో విషము పెట్టి, నా దప్పిక తీర్చుటకు నాకు వెనిగరు ఇచ్చిరి." తాను దప్పికతో ఉన్నానని చెప్పడం ద్వారా, ఆయన రోమన్ సైనికులను తనకు వెనిగరు ఇవ్వమని ప్రేరేపించాడు, ఇది శిలువ వేయబడినప్పుడు ఆచారంగా ఉండేది, అలా ఆయన ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు.

(7) "పూర్తయ్యెను!" (యోహాను 19:30). యేసు పలికిన చివరి మాటల అర్థం, ఆయన బాధలు ముగిశాయని, మరియు ఆయన తండ్రి ఆయనకు చేసిన పని అయిన సువార్తను ప్రకటించడం, అద్భుతాలు చేయడం, మరియు తన ప్రజలకు నిత్య రక్షణను కలుగజేయడం అనే పూర్తి కార్యం సంపూర్ణమై, నెరవేరిందని. పాపపు అప్పు చెల్లించబడింది.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

క్రీస్తు శిలువ మీద పలికిన చివరి ఏడు మాటలు ఏమిటి మరియు వాటి అర్థాలు ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries