settings icon
share icon
ప్రశ్న

లూకా 9:27లో యేసు చెప్పిన "కొందరు మరణాన్ని రుచి చూడరు" అనే వాక్యం తప్పా?

జవాబు


లూకా 9:27 ఇలా చెబుతోంది, "నేను మీతో నిజంగా చెప్తున్నాను, ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసే ముందు మరణాన్ని చూడరు." సమాంతర వాక్యాల కోసం మత్తయి 16:28 మరియు మార్కు 9:1 కూడా చూడండి. సినాప్టిక్ సువార్తలలో ప్రతి ఒక్కటిలోనూ, యేసు ఇచ్చిన ఈ వాగ్దానం తర్వాత వెంటనే జరిగిన సంఘటన రూపాంతరం. యేసు తన రాజ్యాన్ని భూమిపై స్థాపించడానికి రావడాన్ని సూచిస్తూ ఆయన చేసిన వాగ్దానంగా దీనిని అర్థం చేసుకోవడానికి బదులుగా, సందర్భం సూచిస్తున్నదేమంటే, యేసు రూపాంతరం గురించే మాట్లాడుతున్నారని. "రాజ్యం" అని అనువదించబడిన గ్రీకు పదాన్ని "రాజ వైభవం" అని కూడా అనువదించవచ్చు, అంటే అక్కడ నిలబడిన ముగ్గురు శిష్యులు క్రీస్తును ఆయన నిజ స్వరూపంలో—అనగా పరలోక రాజైన ఆయనను—చూస్తారని, ఇది రూపాంతరంలో జరిగింది.

"రూపాంతరం" అనేది పైన ఉదహరించిన వాక్యభాగాలలో వివరించబడిన సంఘటనను సూచిస్తుంది, అప్పుడు యేసు పేతురును, యాకోబును, మరియు యోహానులను కొండ శిఖరానికి తీసుకువెళ్ళాడు, అక్కడ ఆయన పాత నిబంధనలోని ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలకు ప్రాతినిధ్యం వహించే మోషే మరియు ఏలీయాను కలిసి వారితో మాట్లాడాడు. శిష్యులు యేసును ఆయన యొక్క పూర్తి మహిమ మరియు వైభవంతో, మహిమపరచబడిన మోషే మరియు ఏలీయాతో మాట్లాడుతూ చూశారు. ఇది యేసు రాజ్యంలో జరగబోయే వాటికి ఒక సంగ్రహావలోకనం. ఆ దృశ్యానికి శిష్యులు నివ్వెరపోయి, "ముఖములు ఆని" పడిపోయిరి (మత్తయి 17:6).

మత్తయి 16:28; మార్కు 9:1; మరియు లూకా 9:27లోని ఈ వాగ్దానాన్ని, యేసు ఊహించినట్లే సరిగ్గా ఒక వారం తర్వాత కొందరు శిష్యులు సాక్ష్యంగా చూడబోయే రూపాంతరముతో సంబంధం ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం చాలా సహజంగా అనిపిస్తుంది. ప్రతి సువార్తలోనూ, యేసు ఇచ్చిన ఈ వాగ్దానం తర్వాత వెంటనే వచ్చే భాగం రూపాంతరం, ఇది దేవుని రాజ్యంలో మళ్ళీ కనబడనున్న యేసు యొక్క సంపూర్ణ మహిమను చూపిస్తుంది. సందర్భోచిత సంబంధాలు దీనిని సరైన వ్యాఖ్యానంగా ఉండే అవకాశాన్ని బాగా పెంచుతాయి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

లూకా 9:27లో యేసు చెప్పిన "కొందరు మరణాన్ని రుచి చూడరు" అనే వాక్యం తప్పా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries