settings icon
share icon
ప్రశ్న

యేసు దేవదూతల కంటే కొంచెం తక్కువగా ఉన్నారని చెప్పడం అంటే అర్థం ఏమిటి? (కీర్తనలు 8:5; హెబ్రీయులు 2:7)

జవాబు


కీర్తన 8:5 యేసు క్రీస్తు గురించిన ఒక ప్రవచనం. కీర్తనకారుడు ప్రభువు మహిమను గమనిస్తున్నప్పుడు, అతని మనస్సు దేవుని సృష్టి యొక్క గొప్పతనం వైపు మళ్లుతుంది. అతను మనిషి గురించి కూడా ఆలోచించడం ప్రారంభించి, కీర్తన 8:4లో ఈ ప్రశ్న అడుగుతాడు: "మానవుడు ఏమిటని నీవు అతనిని జ్ఞాపకము చేసుకొనుచున్నావు, మనుష్యకుమారుడు ఏమిటని అతనిని గైకొనుచున్నావు?" (ESV). ఆ తర్వాత 5వ వాక్యము ఇలా చెబుతోంది, "అయిననూ నీవు అతనిని పరలోక దూతలకంటె కొంచెము తక్కువగా చేసి, అతని తలమీద మహిమను గౌరవమును కిరీటముగా పెట్టెదవు" (ESV). (హీబ్రూ పాఠ్యంలో, "పరలోక దూతలు" అనేది ఎలోహిమ్, ఇది దేవునికి ఒక సాధారణ నామం; సెప్టువజింట్లో ఏంజెలోస్ అనే పదం ఉంది, దీని అర్థం "దూత".) కీర్తన 8:6 ఇలా కొనసాగుతుంది, "నీ చేతిపనులపై అతనికి అధికారమిచ్చావు; సమస్తమును అతని పాదముల క్రింద ఉంచావు" (ESV). సృష్టి 1:26–28 నుండి, దేవుడు సృష్టించబడిన ప్రపంచంపై పాలన చేసే అధికారాన్ని మానవజాతికి ఇచ్చారని కీర్తనకర్త అర్థం చేసుకున్నాడు. "మానవ కుమారుడు" అనే బిరుదు, మానవ జాతికి అధిపతిగా ఆదామును సూచించవచ్చు. మానవ శరీరంతో సృష్టించబడి, ఈ అధికారం ఇవ్వబడినందున, ఆదాము దేవదూతల కంటే "కొంచెం తక్కువగా" చేయబడ్డాడు, అయినప్పటికీ, అతను దేవుని స్వరూపంలో సృష్టించబడినందున మహిమ మరియు గౌరవంతో కిరీటం ధరించాడు.

హెబ్రీయులకు 2:6–8లో రచయిత కీర్తనలు 8:5 నుండి ఉటంకించి, ఆపై "మానవ కుమారునికి" సృష్టి మొత్తం విధేయత చూపడాన్ని ఇలా వ్యాఖ్యానిస్తాడు: "అతనికి సర్వమును విధేయముగా ఉంచి, తన నియంత్రణకు వెలుపల ఏదీ ఉంచలేదు" (ESV). ఆ తర్వాత హెబ్రీయుల రచయిత ఆ "మానవ కుమారుని" యేసు క్రీస్తు అని గుర్తిస్తాడు: "దేవదూతల కంటే కొంతకాలం తక్కువ స్థితిలో ఉన్నవానిని, అనగా యేసును, మరణపు బాధవల్ల మహిమతోను గౌరవంతోను కిరీటమును ధరించినవానిని మనము చూచుచున్నాము, తద్వారా ఆయన దేవుని కృపవల్ల ప్రతివాని కొరకు మరణమును రుచి చూచెను" (వచనం 9, ESV).

కీర్తనలు 8:5 ను యేసు క్రీస్తుకు వర్తింపజేస్తూ, హెబ్రీయులకు వ్రాసిన వాడు "మానవ కుమారుడు" అనే బిరుదును యేసుకు ఆపాదించాడు. ఇది క్రీస్తు యొక్క మానవత్వాన్ని మరియు మొదటి ఆదాముతో ఆయనకున్న సంబంధాన్ని నొక్కి చెబుతుంది మరియు ఆయనను మానవునికి గొప్ప ఉదాహరణగా ప్రత్యేకపరుస్తుంది. యేసు క్రీస్తు నిజంగా రెండవ ఆదాము, కొత్త ఆదాము, ఆయన మొదటి ఆదాము మానవజాతిపైకి తెచ్చిన మరియు ఎన్నటికీ జయించలేని మరణాన్ని నేరుగా ఎదుర్కోవడానికి వచ్చారు (1 కొరింథీయులు 15:45 చూడండి). లూకా సువార్త యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, యేసు నరపుత్రుడు (లూకా 19:10 చూడండి); ఆయన తన సిలువ, సమాధి, మరియు ఖాళీ సమాధి ద్వారా మానవాళిని మరణం నుండి విమోచించడానికి వచ్చిన రెండవ ఆదాము.

అంతేకాకుండా, దేవుడు మాంసరూపంలోకి వచ్చి పాపరహితమైన శరీరాన్ని స్వీకరించడం ద్వారా, యేసు "పరలోక దూతల కంటే కొంచెం తక్కువగా" చేయబడ్డాడు. ఆయన మానవ శరీరాన్ని ధరించినప్పుడు, యేసు "దాసుని స్వరూపాన్ని తీసుకొని, తనను తానే ఏమీ కాకుండా చేసుకున్నాడు" (ఫిలిప్పీయులు 2:7). ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు తనను తానే ఆ ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడు (గలతీయులు 4:4). ధనవంతుడైన ఆయన మన కొరకు పేదవాడయ్యాడు (2 కొరింథీయులు 8:9). "మనుష్యకుమారుడు సేవించబడటానికి కాదు, సేవించడానికి, మరియు అనేకుల కొరకు విమోచనకరమైన తన జీవమును ఇవ్వడానికి వచ్చెను" (మత్తయి 20:28). దేవదూతలు ఆయన మాంసరూపంలో రావడాన్ని చూసి ఆశ్చర్యపడతారు మరియు సువార్తను పరిశీలించాలని ఆశిస్తారు (1 పేతురు 1:12).

"దూతల కంటే కొంచెం తక్కువగా" చేయబడటం మరియు శాశ్వతంగా ఒక శరీరాన్ని ధరించడం క్రీస్తు దైవత్వాన్ని ఏ మాత్రం తగ్గించలేదు. యేసు ఎన్నటికీ దేవుడు కావడం మానలేదు; ఆయన కేవలం దేవుని వినయాన్ని మరియు కరుణామయత్వాన్ని ప్రదర్శించాడు. అవతారము తర్వాత, ఆయన దైవమానవుడు అయ్యాడు.

క్రూశుపై ఆయన చేసిన ప్రపంచ ప్రయశ్చార్థకమైన క్రియ ఫలితంగా, యేసు మహిమ మరియు గౌరవంతో పట్టాభిషిక్తుడయ్యారు, మరియు ఆయన ఇప్పుడు తన పరలోకపు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నారు (కొలొస్సయులు 3:1). హెబ్రీయులకు వ్రాసిన వాడు యేసు యొక్క వినయస్థితి కేవలం తాత్కాలికమైనదని సూచిస్తున్నాడు: "కొద్ది కాలము" ఆయన దేవదూతలకంటె తక్కువగా చేయబడ్డారు (హెబ్రీయులు 2:7). యేసు అన్ని దూతల కంటే ఉన్నతంగా ఉంచబడ్డారు, మరియు ఏదో ఒక రోజు ప్రతి మోకాలి ఆయన నామమున వంగును, ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనును, తండ్రియైన దేవుని మహిమకొరకు (ఫిలిప్పీయులు 2:9–11).

క్రీస్తును విశ్వసించే వారు భవిష్యత్తులో, మహిమాన్వితమైన సహస్రాబ్దిలో ఆయనతో పాటు పరిపాలిస్తారు. రెండవ ఆదాముగా క్రీస్తు అన్నిటికీ తనకే అధీనపరుస్తాడు. మన పాపము వలన మొదటి ఆదాము మరియు అతని సంతానులు నెరవేర్చడంలో విఫలమైన దానిని (హెబ్రీయులు 2:8 చూడండి), చివరి ఆదాము నెరవేరుస్తాడు, మరియు శాపము తొలగించబడుతుంది (యెషయా 65:17–25 చూడండి). క్రైస్తవ విశ్వాసులందరూ క్రీస్తుతో ఆయన నూతన పరలోకములో మరియు నూతన భూమిలో నివసిస్తూ, యుగయుగములు ఆయన మహిమలో పాలుపంచుకుంటారు. యేసు దేవదూతల కంటే "కొంచెం తక్కువగా" అవ్వకపోతే, మనలో ఎవరికీ విమోచన ఉండేది కాదు. ఆయన మనయొద్దకు వచ్చి, పోయినవారిని వెదకి రక్షించడానికి తనను తాను తగ్గించుకున్నందుకు ప్రభువును స్తుతించాలి (లూకా 19:10).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

యేసు దేవదూతల కంటే కొంచెం తక్కువగా ఉన్నారని చెప్పడం అంటే అర్థం ఏమిటి? (కీర్తనలు 8:5; హెబ్రీయులు 2:7)
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries