ప్రశ్న
దేవుడు మనలను ఎప్పుడు తీర్పు తీరుస్తాడని బైబిల్ చెబుతోంది?
జవాబు
రెండు వేర్వేరు తీర్పులు ఉన్నాయి, ఒకటి విశ్వాసుల కోసం మరియు మరొకటి అవిశ్వాసుల కోసం. ఒకటి దోషనిర్ణయానికి దారితీయని తీర్పు (రోమా 8:1); రెండవ తీర్పు శాశ్వతమైన దోషనిర్ణయానికి దారితీస్తుంది (ప్రకటన 20:15).
విశ్వాసులు క్రీస్తు తీర్పు పీఠమునందు తీర్పు తీసుకొనెదరు (రోమా 14:10–12). భూమిపై ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ఈ తీర్పు బహుశా స్వర్గంలో జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాము. ప్రతి విశ్వాసి ప్రభువు ముందు తనకుతాను లెక్క చెల్లించుకుంటాడు. ఈ తీర్పు రక్షణను నిర్ధారించదు, అది కేవలం విశ్వాసము ద్వారా వస్తుంది (ఎఫెసీయులకు 2:8–9); బదులుగా, విశ్వాసులు పొందబోయే బహుమతులను ఇది నిర్ణయిస్తుంది.
1 కొరింథీయులకు 3:11 క్రీస్తును మన "పునాది"గా చిత్రీకరిస్తుంది, మరియు దాని చుట్టూ ఉన్న వచనాలు క్రైస్తవ జీవితాన్ని ఆ పునాదిపై నిర్మించబడిన భవనంతో పోలుస్తాయి. మనం "బంగారము, వెండి, విలువైన రాళ్లతో" నిర్మించవచ్చు, లేదా "కట్టెలు, గడ్డి, గవ్వ"తో నిర్మించవచ్చు (వచనం 12). మనం నిర్మించినది అగ్నిచే పరీక్షించబడుతుంది. మన నిష్ప్రయోజనకరమైన, నిస్సారమైన కార్యములు దేవుని శుద్ధి చేసే అగ్నిలో నిలబడవు; దేవుని మహిమ కొరకు చేసినది మాత్రమే నిలిచి ఉంటుంది. క్రీస్తు న్యాయసత్రము దీనిని వెల్లడి చేస్తుంది.
క్రైస్తవ సేవలో వారి మంచి పనులు మరియు ప్రభువు పట్ల వారి విశ్వసనీయత ఆధారంగా విశ్వాసులకు బహుమతులు ఇవ్వబడతాయి (1 కొరింథీయులకు 9:24–27తో పోల్చండి). మన కార్యాల, చేయని పనుల, మాటల, ఆలోచనల మరియు ఉద్దేశ్యాల గురించి లెక్క ఇవ్వవలసి ఉంటుంది. అవి క్రీస్తులో మన స్థితికి నిజంగా సూచికగా ఉన్నాయా? "కాబట్టి మనలో ప్రతి ఒక్కడు తన గురించి దేవునికి లెక్క చెల్లించుకొనును" (రోమా 14:12).
రెండవ తీర్పు అవిశ్వాసులది. ఇది కాలం ముగింపులో, సహస్రాబ్ది మరియు భూమిపై సైతాను యొక్క చివరి తిరుగుబాటు తర్వాత జరుగుతుంది. దుర్మార్గుల ఈ తీర్పును గొప్ప తెల్ల సింహాసనపు తీర్పు అని పిలుస్తారు (ప్రకటన 20:11-15). ఈ తీర్పు కూడా రక్షణను నిర్ణయించదు. గొప్ప తెల్ల సింహాసనం వద్ద ఉన్న ప్రతి ఒక్కరూ జీవితంలో క్రీస్తును తిరస్కరించిన అవిశ్వాసులు, మరియు వారి గతి ఇప్పటికే నిర్ణయించబడింది. అవిశ్వాసులు "గ్రంథములలో వ్రాయబడినవాని ప్రకారము" తీర్పు తీర్చబడతారని ప్రకటన 20:12 చెబుతోంది. ప్రభువుగాను రక్షకునిగాను క్రీస్తును తిరస్కరించిన వారు కేవలం వారి క్రియల ఆధారంగా తీర్పు పొందుతారు, మరియు ఏ మానవ క్రియయు పాపానికి ప్రాయశ్చిత్తం చేయలేదు గానీ రక్షణను సంపాదించలేదు గానీ: "నియమమునుబట్టి ఎవడును నీతిమంతుడు కాజాలడు" (గలతీయులకు 2:16). వారి ఆలోచనలన్నీ, మాటలన్నీ, పనులన్నీ దేవుని పరిపూర్ణమైన ప్రమాణంతో కొలవబడతాయి, మరియు వారు లోపభూయిష్టులుగా కనుగొనబడతారు. అవిశ్వాసులకు ఎటువంటి ప్రతిఫలం ఉండదు, కేవలం శాశ్వతమైన ఖండన మరియు శిక్ష మాత్రమే ఉంటాయి.
సంగ్రహంగా చెప్పాలంటే, మరణం తర్వాత (లేదా రప్చర్ తర్వాత), క్రీస్తులో విశ్వాసులు లెక్క ఇవ్వడానికి ప్రభువు సన్నిధిలో నిలబడతారు. వారి పక్షాన క్రీస్తు చేసిన పరిపూర్ణమైన, ప్రశంసనీయమైన క్రియ ఆధారంగా వారు తీర్పు పొందుతారు. మరణం తర్వాత, అవిశ్వాసులు కూడా ప్రభువు ముందు నిలబడతారు, ఆయన వారి రికార్డులను పరిశీలిస్తారు. వారు తమ సొంత అపరిపూర్ణమైన, అనర్హమైన క్రియ మరియు క్రీస్తు వాక్యాన్ని తిరస్కరించడం ఆధారంగా తీర్పు పొందుతారు (యోహాను 12:48).
English
దేవుడు మనలను ఎప్పుడు తీర్పు తీరుస్తాడని బైబిల్ చెబుతోంది?