ప్రశ్న
న్యూమాటోమాకియన్ మతభ్రమ / మాసిడోనియనిజం అంటే ఏమిటి?
జవాబు
మాసిడోనియనిజం అనేది నాలుగవ శతాబ్దపు మతభ్రమ, ఇది పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ దైవత్వాన్ని లేదా వ్యక్తిత్వాన్ని నిరాకరించింది. ఈ భావనను కాన్స్టాంటినోపుల్ యొక్క మాజీ బిషప్, సెమీ-ఏరియన్ అయిన మాసిడోనియస్ అనే వ్యక్తి ప్రచారం చేశారు, మరియు అతని పేరు మీదనే ఈ విశ్వాసం మాసిడోనియనిజం అని పిలువబడింది. ఆత్మ యొక్క దైవత్వాన్ని లేదా వ్యక్తిత్వాన్ని తిరస్కరించిన వారిని న్యూమాటోమాకియన్లు అని పిలిచేవారు, దీని అర్థం "ఆత్మ యొక్క ప్రత్యర్థులు" లేదా "ఆత్మ యోధులు".
న్యూమాటోమాకియన్ల (మాసిడోనియన్ల) ప్రకారం, పరిశుద్ధాత్మ అనేది సృష్టించబడిన ఒక జీవి, తండ్రికి మరియు కుమారునికి లోబడి, ఒక రకమైన సేవకుడి పాత్రలో ఉండేది. ఈ దోషాన్ని క్రీ.శ. 381లో కాన్స్టాంటినోపుల్ సభలో ప్రస్తావించి, ఖండించారు. మాసిడోనియనిజం అనే పెరుగుతున్న మతభ్రమకు ప్రతిచర్యగా, ఈ సభలోని చర్చి నాయకులు పరిశుద్ధాత్మ పూర్తిగా దేవుడని మరియు ఆరాధనకు అర్హుడని మరింత కచ్చితంగా సమర్థించడానికి నికేన్ విశ్వాస సూత్రాన్ని విస్తరించడానికి ఓటు వేశారు. ఆ చేర్పుతో, ఆ విశ్వాస సూత్రం ఇప్పుడు ఇలా ఉంది, "మరియు మేము పరిశుద్ధాత్మను, జీవదాతను మరియు ప్రభువును విశ్వసిస్తున్నాము, ఆయన తండ్రి నుండి బయలుదేరుచున్నారు, ఆయన తండ్రితోను కుమారునితోను కలిసి ఆరాధించబడుచున్నారు మరియు మహిమపరచబడుచున్నారు, ఆయన ప్రవక్తల ద్వారా మాటలాడెను." పవిత్రాత్మ తండ్రికి మరియు కుమారునికి సమరూపుడు (హోమోయూసియస్) అని కాన్స్టాంటినోపుల్ సభ స్పష్టం చేయడానికి ప్రయత్నించింది.
మత్తయి 12:31–32లో యేసు ఇచ్చిన హెచ్చరిక కారణంగా మాసెడోనియనిజం తప్పు అని మనకు తెలుసు. ఆ హెచ్చరికలో ఆయన తరచుగా "క్షమించబడని పాపం" అని పిలవబడే ఒక చర్య గురించి చెప్పారు. త్రుత్యంలోని ఈ వ్యక్తికి వ్యతిరేకంగా దూషణ క్షమించబడదని యేసు పేర్కొన్నారు. నింద అంటే దేవునిపై మౌఖికంగా లేదా వ్రాతపూర్వకంగా చూపే తిరుగుబాటుతో కూడిన అగౌరవం, కాబట్టి, నిర్వచనం ప్రకారం, నింద కేవలం దైవత్వం వైపే ఉంటుంది. పరిశుద్ధాత్మ పూర్తిగా దేవుడు కాకపోతే, ఎవరూ ఆయనను నిందించలేరు, కాబట్టి యేసు ఈ హెచ్చరికతో పరిశుద్ధాత్మ దైవత్వాన్ని ధృవీకరించారు.
మత్తయి 28:19లో గొప్ప ఆజ్ఞగా పిలవబడే తన ప్రసంగంలో, యేసు పరిశుద్ధాత్మను దేవునితో సమానంగా పేర్కొన్నారు. యేసు కొత్త శిష్యులకు దేవత్వములోని ముగ్గురు వ్యక్తులైన తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకోవాలని ఆజ్ఞాపించాడు. పరిశుద్ధాత్మ వారికి సమానుడు కాకపోతే, కుమారుడు తనను మరియు తండ్రితో పాటు ఆత్మను జాబితా చేయడు.
యేసును "ఆత్మచేత" అరణ్యంలోకి సాతాను ప్రలోభపెట్టడానికి నడిపించినప్పుడు, లూకా 4:1–14 మరియు మత్తయి 4:1–11లో పరిశుద్ధాత్మ యొక్క విభిన్నమైన కానీ సమానమైన వ్యక్తిత్వానికి మరొక లేఖన ఉదాహరణ కనిపిస్తుంది. ఇది పరిశుద్ధాత్మకు తన సొంత చిత్తం ఉందని చూపిస్తుంది, మరియు యేసు ఆయన నడిపింపును అనుసరించి ఒక ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్ళారు. యేసు తన పరీక్షలన్నింటినీ పూర్తి చేసినప్పుడు, ఆయన "ఆత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చారు" (లూకా 4:14). యేసు తన బలము కొరకు ఆత్మ శక్తిని ఆధారపడియున్నాడు. సైతానుకు వ్యతిరేకంగా దేవుని కుమారునికి శక్తినిచ్చుటకు దేవుడే స్వయంగా సమర్థుడు, మరియు ఆత్మమే ఆ శక్తినిచ్చింది.
అదృష్టవశాత్తు, నాలుగవ శతాబ్దం చివరి నాటికి న్యూమాటోమాకియన్ మతదురాచారం (మాసిడోనియనిజం) ఖండించబడింది. అలెగ్జాండ్రియాకు చెందిన అథానాసియస్ మరియు కైసరియాకు చెందిన బేసిల్ వంటి విశ్వాస పరిరక్షకులు మంచి పోరాటం చేసి న్యూమాటోమాకియన్లను వ్యతిరేకించారు. నేటి నిజమైన క్రైస్తవులు పరిశుద్ధాత్మను త్రిత్వ దేవునిలో ఒక ప్రత్యేకమైన మరియు అద్భుతమైన వ్యక్తిగా గుర్తిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే క్రైస్తవులు ఆత్మీయ వరాలను పొందుతారు, అవి సంఘం వృద్ధి చెందడానికి మరియు వ్యాపించడానికి వీలు కల్పిస్తాయి (లూకా 24:49; 1 కొరింథీయులు 12:1–11; హెబ్రీయులు 2:4; 1 పేతురు 4:10). క్రీస్తుపై విశ్వాసము ద్వారా పునర్జన్మ పొందిన ప్రతి ఒక్కరిలో నివసించే దేవుడే పరిశుద్ధాత్ముడు (యోహాను 3:3; అపొస్తలుల కార్యములు 2:38; 1 కొరింథీయులు 6:19–20). ఆత్మయే తాను ప్రేరేపించిన వాక్యాన్ని మనకు బోధించేది (2 పేతురు 1:21) మరియు మనం నిజంగా దేవుని పిల్లలమని మనకు ధృవీకరించేది (రోమీయులు 8:16; హెబ్రీయులు 10:15). దేవుడు మాత్రమే అదంతా చేయగలడు.
English
న్యూమాటోమాకియన్ మతభ్రమ / మాసిడోనియనిజం అంటే ఏమిటి?