settings icon
share icon
ప్రశ్న

మైత్రేయుడు ఎవరు? మైత్రేయుడు అంటీక్రీస్తునా?

జవాబు


మైత్రేయుడు అనే పేరు సాధారణంగా బౌద్ధమతంలో "రాబోయే బుద్ధుడు" కోసం ఉపయోగించే పేరుగా పరిగణించబడుతుంది, అయినప్పటికీ మైత్రేయుని మూలాలు అస్పష్టంగా మరియు వివాదాస్పదంగా ఉన్నాయి. అంటీక్రీస్తు అటువంటి వ్యక్తి రూపంలో వస్తాడనడానికి శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేనప్పటికీ, వారి మధ్య సారూప్యతలు ఉన్నాయి. మైత్రేయ ఒక బోధిసత్వుడు అని అంటారు. భూమిపై జీవించి, ఒక రోజు జ్ఞానోదయం పొందనున్నవాడు లేదా జ్ఞానానికి దగ్గరైనవాడు, మరియు మరణం తర్వాత ధ్యానం ద్వారా చేరుకోగల బౌద్ధ స్వర్గలోకాలలో ఒకదానికి వెళ్ళిన వ్యక్తిని సూచించే పదం ఇది. బోధిసత్వుని యొక్క ఊహించిన పాత్రలలో ఒకటి, అతని బోధనలకు సిద్ధంగా ఉన్న భూమిపై ఉన్నవారికి మార్గనిర్దేశం చేయడం. ఈ ప్రత్యేక బోధిసత్వుడు, మైత్రేయుడు, ఒక కీలకమైన సమయంలో తిరిగి వస్తాడని నమ్ముతారు. ఇతరులను ప్రభావితం చేయడానికి అతీంద్రియ శక్తిని కలిగి ఉండే వ్యక్తియే అంటీక్రీస్ట్ అని బైబిల్ చెబుతుంది (ప్రకటన 13:4-8) మరియు అతను తాను "జ్ఞానోదయం పొందినవాడిని" అని లక్షలాది మందిని ఒప్పించగలడు, ఎంతగా అంటే వారు అతని బోధనలను అనుసరిస్తారు.

ఈ భవిష్యత్ బుద్ధుని ప్రవచనం అన్ని బౌద్ధ సంప్రదాయాల ప్రామాణిక సాహిత్యంలో కనిపిస్తుంది. ఈ వివిధ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం మైత్రేయుని బోధనలు కొంత భిన్నంగా ఉండవచ్చు. బౌద్ధ మైత్రేయుడు సింహాసనంపై కూర్చొని, తన సమయం రావడం కోసం వేచి ఉన్నట్లు చిత్రీకరించబడ్డాడు. బౌద్ధ బోధనలు కనుమరుగైనప్పుడు అతను వస్తాడని, మరియు బౌద్ధమతం యొక్క స్వచ్ఛమైన బోధనలను (ధర్మం) బోధిస్తాడని చెప్పబడింది.

1800లలో ఎమ్. బి. బ్లావట్స్కీ స్థాపించిన థియోసోఫికల్ సొసైటీ అనే అతీంద్రియ సంస్థతో సహా ఇతర విశ్వాస వ్యవస్థలు కూడా మైత్రేయను స్వీకరించాయి. థియోసోఫిస్టులు మైత్రేయను ఒక ప్రపంచ గురువుగా మరియు క్రీస్తుగా పరిగణిస్తారు. ఆధునిక న్యూ ఏజ్ ఉద్యమానికి థియోసోఫీ పూర్వగామి మరియు పునాదులలో ఒకటి; అందువల్ల, నేడు అనేక న్యూ ఏజ్ ఆధారిత సమూహాలలో మైత్రేయ గురించిన బోధనలు కనిపిస్తాయి.

మైత్రేయుడిని అనేక సమూహాలు స్వీకరించడం వల్ల, మైత్రేయుడిపై బోధనలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. అయితే, చాలా బౌద్ధేతర సమూహాలు మైత్రేయుడు తన బోధనల ద్వారా అన్ని మతాలను ఏకం చేస్తాడని మరియు సార్వత్రిక సౌభ్రాతృత్వాన్ని బోధించడం ద్వారా మానవత్వాన్ని ఆర్థిక మరియు ఇతర సంక్షోభాల నుండి రక్షిస్తాడని బోధిస్తాయి. మైత్రేయుడికి క్రీస్తు, మెస్సయ్య, కృష్ణుడు (ఒక హిందూ దేవుడు), మరియు గురువు వంటి అనేక పేర్లు ఇవ్వబడ్డాయి. కొంతమంది ముస్లింలు మహమ్మద్ మైత్రేయఅని, కొంతమంది బహాయిలు వారి ప్రధాన ప్రవక్త, బహాఉల్లా, మైత్రేయ అని నమ్ముతారు; అందువల్ల, ఈ రెండు సమూహాలు మైత్రేయ ఇప్పటికే ప్రత్యక్షమయ్యాడని నమ్ముతాయి.

మైత్రేయ రాకను ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందిన ఒక సమూహం షేర్ ఇంటర్నేషనల్, దీనిని బెంజమిన్ క్రీమ్ (1922లో జన్మించారు) అనే వ్యక్తి స్థాపించి, నడుపుతున్నారు. గతంలో, క్రీమ్, మైత్రేయుడు ప్రత్యక్షమై టెలివిజన్ ద్వారా (1982 మరియు 1997లలో) ఒక సందేశాన్ని ప్రసారం చేస్తాడని ప్రకటించి, తనకు చాలా ప్రచారం సంపాదించుకున్నాడు. ఈ అంచనాలు విఫలమైనప్పుడు, చాలా మంది క్రీమ్ ప్రకటనలు మరియు సంస్థపై ఆసక్తిని కోల్పోయారు.

అంటీక్రీస్ట్ తాను మైత్రేయుడినని చెప్పుకుంటాడా లేదా అనే దానిపై ఊహాగానాలు చేయడం చాలా నిష్ఫలంగా అనిపిస్తుంది; మైత్రేయుడు ఒక నిజమైన వ్యక్తి కాదు, కానీ పురాణ విశ్వాసాలలో ఒక భాగం. ప్రకటన గ్రంథం 13:11-15లోని "మృగం" (ప్రకటన గ్రంథంలో "అంటీక్రీస్ట్" అనే పదం లేదు) తాను మైత్రేయుడినని చెప్పుకునే వ్యక్తి కావచ్చు, లేదా ఇతరులు మైత్రేయుడిగా భావించే వ్యక్తి కావచ్చు. అయితే, ఆ దుష్ట జంతువు ఎవరో దేవుని వాక్యం మనకు సమాచారం ఇవ్వనందున, ప్రతి ఒక్కరూ తమ రక్షణను నిశ్చయించుకోవడం ఉత్తమం, తద్వారా అంటీక్రీస్ట్/దుష్ట జంతువు ఎవరైనా సరే, క్రీస్తుపై విశ్వాసం ద్వారా నిత్యజీవంలో శాంతిని మరియు భద్రతను పొందగలరు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

మైత్రేయుడు ఎవరు? మైత్రేయుడు అంటీక్రీస్తునా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries