settings icon
share icon
ప్రశ్న

న్యాయాధిపతిగా యేసు గురించి బైబిల్ ఏమి బోధిస్తుంది?

జవాబు


తండ్రి తనకు తీర్పు తీర్చే అధికారం ఎలా ఇచ్చారో యేసు వివరిస్తున్నారు. యోహాను 5:22-23లో ఆయన ఇలా అంటున్నారు, "తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుణ్ణి ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు." అవును, యేసు తనను నమ్మిన వారిని రక్షించడానికి లోకంలోకి వచ్చారు (యోహాను 3:16), కానీ ఆయన రాక తీర్పును కూడా తీసుకువచ్చింది (యోహాను 9:39). తన మరణం మరియు పునరుత్థానం ద్వారా, యేసు సాతానుకు తీర్పు తీసుకువచ్చారు (యోహాను 12:31–33). అంతేకాకుండా, అవిశ్వాసులు చివరికి ప్రభువైన యేసుచే తీర్పు తీర్చబడతారు.

యేసు విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు న్యాయాధిపతిగా వ్యవహరిస్తాడు. క్రీస్తు బెమా సింహాసనం వద్ద, ఆయన రక్షణ తర్వాత విశ్వాసుల క్రియలను బట్టి బహుమతిని లేదా బహుమతి నష్టాన్ని నిర్ణయిస్తాడు (1 కొరింథీయులు 4:5; 2 కొరింథీయులు 5:10). ఈ తీర్పుకు రక్షణతో ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే విశ్వాసుల శాశ్వతమైన గమ్యం యేసులో సురక్షితంగా ఉంది (ఎఫెసయులు 1:13–14). దానికి బదులుగా, విశ్వాసులు క్రీస్తుకు ఎంత విశ్వసనీయంగా సేవ చేశారనే దాని ప్రకారం బహుమతులను పొందుతారు (లూకా 19:12–27; 1 కొరింథీయులు 3:12–15). దీనికి విరుద్ధంగా, అవిశ్వాసులు గొప్ప శ్వేత సింహాసన న్యాయవిచారణలో క్రీస్తుచే తీర్పు పొందుతారు (ప్రకటన 20:11–15). మళ్ళీ, ఈ తీర్పు వారి శాశ్వతమైన గమ్యానికి సంబంధం లేదు—ఆ సమయానికి, అవిశ్వాసులు యేసును తిరస్కరించడం ద్వారా తమ విధిని ఇప్పటికే నిర్ధారించుకున్నారు. గొప్ప శ్వేత సింహాసనపు తీర్పు, అవిశ్వాసులు తమ జీవితంలో చేసిన వాటి ఆధారంగా వారి శిక్ష యొక్క తీవ్రతను నిర్ధారిస్తుంది (ప్రకటన 20:12). గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ తీర్పులో ఉన్న ప్రజలందరూ జీవగ్రంథములో వారి పేర్లు కనబడనందున అగ్ని సరస్సులోకి విసిరివేయబడతారు, అంటే వారు క్రీస్తు యొక్క ఉచిత రక్షణ బహుమతిని తిరస్కరించారు (ప్రకటన 20:15).

యేసు న్యాయపాలన చేసే మరొక తీర్పును గొర్రెలు మేకల తీర్పు లేదా జనాల తీర్పు అని పిలుస్తారు (మత్తయి 25:31–46). కొంతమంది వ్యాఖ్యాతలు ఈ తీర్పును గొప్ప తెల్ల సింహాసనపు తీర్పుతో సమానంగా భావిస్తారు, కానీ వాటి మధ్య అనేక ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రధానమైన తేడా ఏమిటంటే, ఈ తీర్పు ప్రజలు యేసు యొక్క "సహోదరులను", అనగా ఇశ్రాయేలు ప్రజలను ఎలా చూశారనే దానిపై ఆధారపడి ఉంటుంది (మత్తయి 25:40). యేసు రెండవ రాక తర్వాత ఇది జరుగుతుండటం, గొర్రెల మేకల తీర్పు బహుశా క్రీస్తు తిరిగి వచ్చే సమయంలో జీవించి ఉన్నవారి భౌతిక గతిని నిర్ణయిస్తుంది (మత్తయి 25:1–30). ఈ తీర్పు సమయంలో, యేసు "గొర్రెలను" "మేకల నుండి" వేరు చేస్తాడు. గొర్రెలు అనగా శ్రమకాలంలో యూదు ప్రజలకు సహాయం చేయడం ద్వారా తమ విశ్వాసానికి సాక్ష్యమిచ్చిన విశ్వాసులు; మేకలు అనగా శ్రమకాలంలో యూదులకు సహాయం చేయడంలో విఫలమవడం ద్వారా తమ అవిశ్వాసాన్ని ప్రదర్శించిన అవిశ్వాసులు (మత్తయి 25:33–36, 41–43). కష్టకాలంలో క్రీస్తును తిరస్కరించి, మృగం పక్షాన నిలిచిన వారు "వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు" వెళ్తారు (మత్తయి 25:46).

యేసు దేవుడు మరియు మనిషిగా ఉన్నందున, ఆయన మానవాళికి పరిపూర్ణుడైన న్యాయాధిపతి. ఆయన తీర్పు న్యాయంగా, పరిపూర్ణంగా ఉంటుంది మరియు దానికి అప్పీల్ చేయడానికి వీలుండదు (అపోస్తలుల కార్యములు 17:31). ఆయన కొన్నిసార్లు అన్యాయంగా తీర్పు తీర్చి, తమ స్వప్రయోజనాల కోసం ప్రయత్నించే పాపపు మానవ పాలకుల వంటి వారు కాదు. దానికి బదులుగా, యేసు ఇలా అంటారు, "నేను నాంతట నేను ఏమి చేయలేను. నేను ఏమి వింటానో, అదే తీర్పు తీరుస్తాను, మరియు నా తీర్పు నీతిమయమైనది, ఎందుకంటే నేను నా చిత్తాన్ని కాదు, నన్ను పంపిన వాని చిత్తాన్నే వెదకుతాను" (యోహాను 5:30). యేసు న్యాయమైన న్యాయాధిపతి అని, ఆయన తన జ్ఞానము మరియు నీతినిబట్టి తీర్పు తీరుస్తారని మనం నిశ్చింతగా ఉండవచ్చు (యెషయా 11:3–4; యోహాను 8:15–16; ప్రకటన 19:11). దేవుని కుమారుడు అన్యాయంతో నిండిన ఈ లోకాన్ని శాంతి మరియు భద్రత గల ప్రదేశంగా మార్చుతాడు. ఇకపై నేరస్థులు విడుదల చేయబడరు; ఇకపై అమాయకులు బాధపడరు: "ఆయన నీ నీతిఫలమును ఉదయకాంతివలె ప్రకాశింపజేయును, నీ నిర్దోషత్వమును మధ్యాహ్నపు సూర్యరశ్మివలె నిలబెట్టును" (కీర్తనలు 37:6).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

న్యాయాధిపతిగా యేసు గురించి బైబిల్ ఏమి బోధిస్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries