settings icon
share icon
ప్రశ్న

యేసు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పినవి, చేసినవి సువార్తలలో ఎలా నమోదయ్యాయి?

జవాబు


సువార్తలలో, యేసు ఒంటరిగా ఉన్న సమయాల్లో ఆయన మాటలు ఉదహరించబడిన లేదా ఆయన చేతలు వర్ణించబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, యేసు నలభై రోజులు అరణ్యంలో ఉన్నప్పుడు (మత్తయి 4) లేదా గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు (మార్కు 14), ఆయన ఒంటరిగా ఉన్నారు. జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేనప్పుడు, ఆయన ఏమి చెప్పారో లేదా చేశారో ఎవరికి తెలిసింది?

సువార్త కథనాలు, ఏదో రకమైన రోజువారీ జర్నల్ ఎంట్రీలా, సంఘటనలు జరిగిన సమయంలోనే వ్రాయబడలేదు; బదులుగా, చాలా చారిత్రక కథనాల వలె, జ్ఞాపకం, పరిశోధన మరియు సంకలనం ఆధారంగా అవి తరువాత రూపొందించబడ్డాయి. మత్తయి మరియు యోహాను ఇద్దరూ తమ కథనాలలోని చాలా సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులు. మార్కు మరియు లూకాకు కళ్లారా చూసిన సాక్షులతో సంప్రదించే అవకాశం లభించింది. నిజానికి, లూకా తన సువార్తను వ్రాయడానికి ముందు "మొదటి నుండి ఉన్నవాటన్నిటినీ శ్రద్ధగా పరిశీలించానని" పేర్కొన్నాడు (లూకా 1:3). బహుశా, మార్కు తన సువార్త కోసం అపొస్తలుడైన పేతురు నుండి సమాచారాన్ని సేకరించాడు (1 పేతురు 5:13). రచయితలకు లభించిన మరో ప్రయోజనం—మరియు ఇది చాలా పెద్దది—వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణ పొందారు (2 తిమోతి 3:16). నిజానికి, యేసు వారికి వాగ్దానం చేశారు, ఆత్మ వారికి "నేను చెప్పిన ప్రతీదాన్ని" వారికి జ్ఞాపకము చేస్తుందని (యోహాను 14:26).

అయినప్పటికీ, యేసు నుండి దూరంగా ఉన్నప్పుడు ఏమి జరిగిందో శిష్యులకు ఎలా తెలిసింది? ఒక సంభావ్య వివరణ ఏమిటంటే, వారు తమ చరిత్రలను వ్రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారికి జరిగినది చెప్పింది. సువార్తలు దైవికంగా ప్రేరేపించబడ్డాయని నమ్ముతూ, మనం ఆ వివరణను సులభంగా అంగీకరించవచ్చు.

మరొక వివరణ ఏమిటంటే, యేసు ఆ తర్వాత తన శిష్యులకు వారు కోల్పోయిన విషయాన్ని చెప్పారు. మత్తయి 4లో అరణ్యంలోని శోధన సమయంలో యేసుతో ఏ శిష్యుడును ఉండి లేరు, కానీ, ఆ తర్వాత, యేసు శిష్యులతో మూడు సంవత్సరాలకు పైగా గడిపారు. ఆ మూడు సంవత్సరాలలో ఏదో ఒక సమయంలో ఆయన వారికి జరిగిన విషయాన్ని చెప్పి ఉండవచ్చు కదా? అదేవిధంగా, యోహాను 4లో యేసు బావి దగ్గర ఉన్న స్త్రీతో మాట్లాడినప్పుడు ఒంటరిగా ఉన్నారు, అయినప్పటికీ వారి సంభాషణ చాలా వివరంగా ఉదహరించబడింది. దీనికి ఒక సామాన్యమైన వివరణ ఏమిటంటే, యేసు తరువాత తన శిష్యులకు ఆ విషయాన్ని వివరించారు. లేదా, ఆమె మారుమనస్సు చెందిన తరువాత శిష్యులు ఆమె పట్టణంలో రెండు రోజులు ఉన్నందున (యోహాను 4:40), యోహాను ఆ కథను ఆ స్త్రీ నుండి పొంది ఉండవచ్చు.

ఆయన పునరుత్థానం తర్వాత, యేసు నలభై దినముల పాటు శిష్యులకు ప్రత్యక్షమై "దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడెను" (అపొస్తలుల కార్యములు 1:3). ఆ నలభై దినములలో, వారు దగ్గర లేనప్పుడు తనకు జరిగిన సమస్తమును శిష్యులకు తెలియజేయడానికి యేసుకు పుష్కలమైన అవకాశం లభించియుంటుంది. ఏది ఏమైనప్పటికీ, దేవుడు మనం తెలుసుకోవాలని కోరుకున్న యేసు జీవితంలోని సంఘటనలు—ఒంటరిగా జరిగిన సంఘటనలతో సహా—వ్రాయబడ్డాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు మనం తెలుసుకోవాలని కోరుకున్నాడు. ఆ సంఘటనలు తరువాత కాలంలో యేసు ద్వారా లేదా మరెవరి ద్వారానైనా నేరుగా శిష్యులకు వెల్లడి చేయబడ్డాయి, లేదా దేవుని వాక్యాన్ని వ్రాస్తున్నప్పుడు అపొస్తలులు ఆ వివరాలను నేరుగా పరిశుద్ధాత్మ నుండి తెలుసుకున్నారు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

యేసు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పినవి, చేసినవి సువార్తలలో ఎలా నమోదయ్యాయి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries